ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే 10 భాషలలో తెలుగు ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి జనాభా దాదాపు 15 కోట్లు.తెలుగు తేజానికి క్రీస్తు శకం ప్రారంభానికి ముందే పునాదులు పడ్డయనడానికి ఆధారాలున్నాయి. అమరావతి స్తూప శిధిలాల్లో దొరికిన చిన్న రాతి ముక్క మీద 'నాగబు' అనే మాట ఉంది. అలాగే తెలుగు నేలను ఏలిన ఆంద్ర శాతవాహన చక్రవర్తులలో ఒకరి పేరు 'పుళుమవి'. ఈ రెండు తెలుగు పదాలే. అమరావతి స్తూపం వయస్సు 2000-2400 సంవత్సరాల మద్య ఉంటుందని అంచనా కనుక, తెలుగు భాష వయస్సు అంతకంటే ఎక్కువేనని భావించాలి.